9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు
- October 07, 2022
దుబాయ్: దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు సెప్టెంబర్ నెలలో 9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరాయి. సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 13.34 శాతం పెరిగి 8,649కి చేరాయి. అదే సమయంలో డీల్ల విలువ 23.04 శాతం పెరిగి 24.42 బిలియన్ దిర్హామ్లకు చేరుకుంది. 2013 తర్వాత ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారని ప్రాపర్టీ ఫైండర్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. ఆఫ్-ప్లాన్, సెకండరీ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల సెప్టెంబర్లో ఆస్తి లావాదేవీల విలువ తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని నివేదిక వెల్లడించింది. నివేదిక డేటా ప్రకారం.. ప్రస్తుత ఆస్తుల లావాదేవీలు విలువ పరంగా 32.39 శాతం పెరిగాయి. ఆఫ్-ప్లాన్ మార్కెట్ సెప్టెంబర్లో Dh9.755 బిలియన్ల విలువైన 4,439 ఆస్తుల లావాదేవీలు జరిగాయి. వాల్యూమ్ పరంగా 80.23 శాతం, విలువ పరంగా 94.13 శాతం పెరుగుదల నమోదైంది. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఫైండర్లో యూఏఈ కంట్రీ మేనేజర్ స్కాట్ బాండ్ మాట్లాడుతూ.. యూఏఈ చురుకైన వ్యూహాలు, ఆకర్షణీయమైన విధానాలు, గోల్డెన్ వీసా చొరవ, బలీయమైన పెట్టుబడి విధానాలు దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాల వృద్ధికి కారణాలుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







