9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు
- October 07, 2022
దుబాయ్: దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు సెప్టెంబర్ నెలలో 9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరాయి. సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 13.34 శాతం పెరిగి 8,649కి చేరాయి. అదే సమయంలో డీల్ల విలువ 23.04 శాతం పెరిగి 24.42 బిలియన్ దిర్హామ్లకు చేరుకుంది. 2013 తర్వాత ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారని ప్రాపర్టీ ఫైండర్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. ఆఫ్-ప్లాన్, సెకండరీ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల సెప్టెంబర్లో ఆస్తి లావాదేవీల విలువ తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని నివేదిక వెల్లడించింది. నివేదిక డేటా ప్రకారం.. ప్రస్తుత ఆస్తుల లావాదేవీలు విలువ పరంగా 32.39 శాతం పెరిగాయి. ఆఫ్-ప్లాన్ మార్కెట్ సెప్టెంబర్లో Dh9.755 బిలియన్ల విలువైన 4,439 ఆస్తుల లావాదేవీలు జరిగాయి. వాల్యూమ్ పరంగా 80.23 శాతం, విలువ పరంగా 94.13 శాతం పెరుగుదల నమోదైంది. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఫైండర్లో యూఏఈ కంట్రీ మేనేజర్ స్కాట్ బాండ్ మాట్లాడుతూ.. యూఏఈ చురుకైన వ్యూహాలు, ఆకర్షణీయమైన విధానాలు, గోల్డెన్ వీసా చొరవ, బలీయమైన పెట్టుబడి విధానాలు దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాల వృద్ధికి కారణాలుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







