అమెరికాలో కిడ్నాప్ అయిన నలుగురు భారత సంతతి వ్యక్తులు హత్య ..
- October 07, 2022
అమెరికా: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ కు గురి అయ్యారు. వీరిని క్షేమంగా రక్షించటానికి అమెరికా పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. కిడ్నాప్ కు గురి అయినవారంత హత్య చేయబడ్డారు. ఎనిమిది నెలల చిన్నారి సహా కిడ్నాపర్ నలుగురిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఓ తోటలో ఎనిమిది నెలల చంటిపాపతో సహా నలుగురు విగత జీవులుగా కనిపించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గత సోమవారం (అక్టోబర్ 2202)కిడ్నాప్ కు గురైన ఈ నలుగురూ ఓ తోటలో విగత జీవులుగా కనిపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా భారత సిక్కు కుటుంబానికి చెందిన వాళ్లు. మృతులను కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన 36 ఏళ్ల జస్దీప్ సింగ్, అతని భార్య 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల పాప ఆరూహి దేహి,39 ఏళ్ల వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ లుగా గుర్తించారు.
జస్దీప్ కుటుంబం కొన్ని రోజుల కిందట ట్రక్కుల రవాణా వ్యాపారం ప్రారంభించింది. సోమవారం ఉదయం ఈ నలుగురూ తమ ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఓ గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ నలుగురినీ ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. కిడ్నాప్ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు.
దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించగా అక్కడి సీసీ పుటేజీ ఆధారంగా 48 ఏళ్ల మాన్వేల్ సాల్గాడో అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే ఈ నలుగురినీ హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణానికి గత కారణాలు తెలియాల్సి ఉంది. కాగా..ఆర్థిక లావాదేవీలే కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా..పోలీసుల కస్టడీలో ఉన్న సాల్గాడో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సాల్గాడో పేరు మోసిన నేరగాడు. 2005 నాటి ఆయుధాల దోపిడీ కేసులో ఇతను 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







