మంటల్లో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- October 08, 2022
సౌదీ: ఎర్ర సముద్రంలో జజాన్ పోర్ట్కు వాయువ్యంగా 123 నాటికల్ మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకున్నపనామాకు చెందిన ట్యాంకర్ షిప్ సిబ్బందిని రక్షించినట్లు సౌదీ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది. జెడ్డా సెర్చ్ అండ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (JMRCC)కి మంటలు చెలరేగిన షిప్ నుండి మేడే సిగ్నల్ అందిందని, వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి సహాయక బృందాలు వెళ్లాయని బోర్డర్ గార్డ్స్ అధికారిక ప్రతినిధి కల్నల్ మిస్ఫ్ర్ అల్-ఖరినీ వివరించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులతో కూడిన సిబ్బందిని రక్షించి జజాన్ నౌకాశ్రయానికి వారిని సురక్షితంగా తరలించినట్లు కల్నల్ అల్-ఖరినీ వెల్లడించారు. ప్రస్తుతం నౌకా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









