మంటల్లో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- October 08, 2022
సౌదీ: ఎర్ర సముద్రంలో జజాన్ పోర్ట్కు వాయువ్యంగా 123 నాటికల్ మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకున్నపనామాకు చెందిన ట్యాంకర్ షిప్ సిబ్బందిని రక్షించినట్లు సౌదీ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది. జెడ్డా సెర్చ్ అండ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (JMRCC)కి మంటలు చెలరేగిన షిప్ నుండి మేడే సిగ్నల్ అందిందని, వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి సహాయక బృందాలు వెళ్లాయని బోర్డర్ గార్డ్స్ అధికారిక ప్రతినిధి కల్నల్ మిస్ఫ్ర్ అల్-ఖరినీ వివరించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులతో కూడిన సిబ్బందిని రక్షించి జజాన్ నౌకాశ్రయానికి వారిని సురక్షితంగా తరలించినట్లు కల్నల్ అల్-ఖరినీ వెల్లడించారు. ప్రస్తుతం నౌకా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







