మంటల్లో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్

- October 08, 2022 , by Maagulf
మంటల్లో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్

సౌదీ: ఎర్ర సముద్రంలో జజాన్ పోర్ట్‌కు వాయువ్యంగా 123 నాటికల్ మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకున్నపనామాకు చెందిన ట్యాంకర్ షిప్ సిబ్బందిని రక్షించినట్లు సౌదీ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది. జెడ్డా సెర్చ్ అండ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (JMRCC)కి మంటలు చెలరేగిన షిప్ నుండి మేడే సిగ్నల్ అందిందని, వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి సహాయక బృందాలు వెళ్లాయని బోర్డర్ గార్డ్స్ అధికారిక ప్రతినిధి కల్నల్ మిస్ఫ్ర్ అల్-ఖరినీ వివరించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులతో కూడిన సిబ్బందిని రక్షించి జజాన్ నౌకాశ్రయానికి వారిని సురక్షితంగా తరలించినట్లు కల్నల్ అల్-ఖరినీ వెల్లడించారు. ప్రస్తుతం నౌకా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com