నైట్క్లబ్లో పరిచయమైన వ్యక్తిని దోచుకున్న మహిళకు జైలుశిక్ష
- October 09, 2022
దుబాయ్: నైట్క్లబ్లో పరిచయమైన అమెరికన్ వ్యక్తి నుంచి 1,000 దిర్హామ్ నగదు, 8,000 దిర్హామ్ విలువైన బంగారు గొలుసును దొంగిలించినందుకు ఒక ఆఫ్రికన్ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. దొంగిలించిన గొలుసును ప్రియుడికి అప్పగించిన మహిళ.. ఆ తర్వాత దానిని కరిగించి దుబాయ్లోని బంగారం మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ కేసు గత జూలైలో జరిగింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధిత అమెరికన్ ఒక నైట్క్లబ్లో ఆ మహిళను కలుసుకున్నాడని.. అనంతరం ఆమెను తన ఫ్లాట్ కి ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొనే సమయానికి ఆఫ్రికన్ మహిళ వెళ్లిపోయింది. తర్వాత తన ఫ్లాట్ లో నగదు, బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి కరిగించిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసు ఆపరేషన్స్ గదికి సమాచారం రావడంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. అతడిని అరెస్టు చేసి విచారించగా.. తన స్నేహితురాలు తనకు ఇచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఆమెను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









