నైట్క్లబ్లో పరిచయమైన వ్యక్తిని దోచుకున్న మహిళకు జైలుశిక్ష
- October 09, 2022
దుబాయ్: నైట్క్లబ్లో పరిచయమైన అమెరికన్ వ్యక్తి నుంచి 1,000 దిర్హామ్ నగదు, 8,000 దిర్హామ్ విలువైన బంగారు గొలుసును దొంగిలించినందుకు ఒక ఆఫ్రికన్ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. దొంగిలించిన గొలుసును ప్రియుడికి అప్పగించిన మహిళ.. ఆ తర్వాత దానిని కరిగించి దుబాయ్లోని బంగారం మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ కేసు గత జూలైలో జరిగింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధిత అమెరికన్ ఒక నైట్క్లబ్లో ఆ మహిళను కలుసుకున్నాడని.. అనంతరం ఆమెను తన ఫ్లాట్ కి ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొనే సమయానికి ఆఫ్రికన్ మహిళ వెళ్లిపోయింది. తర్వాత తన ఫ్లాట్ లో నగదు, బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి కరిగించిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసు ఆపరేషన్స్ గదికి సమాచారం రావడంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. అతడిని అరెస్టు చేసి విచారించగా.. తన స్నేహితురాలు తనకు ఇచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఆమెను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









