నైట్క్లబ్లో పరిచయమైన వ్యక్తిని దోచుకున్న మహిళకు జైలుశిక్ష
- October 09, 2022
దుబాయ్: నైట్క్లబ్లో పరిచయమైన అమెరికన్ వ్యక్తి నుంచి 1,000 దిర్హామ్ నగదు, 8,000 దిర్హామ్ విలువైన బంగారు గొలుసును దొంగిలించినందుకు ఒక ఆఫ్రికన్ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. దొంగిలించిన గొలుసును ప్రియుడికి అప్పగించిన మహిళ.. ఆ తర్వాత దానిని కరిగించి దుబాయ్లోని బంగారం మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ కేసు గత జూలైలో జరిగింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధిత అమెరికన్ ఒక నైట్క్లబ్లో ఆ మహిళను కలుసుకున్నాడని.. అనంతరం ఆమెను తన ఫ్లాట్ కి ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొనే సమయానికి ఆఫ్రికన్ మహిళ వెళ్లిపోయింది. తర్వాత తన ఫ్లాట్ లో నగదు, బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి కరిగించిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసు ఆపరేషన్స్ గదికి సమాచారం రావడంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. అతడిని అరెస్టు చేసి విచారించగా.. తన స్నేహితురాలు తనకు ఇచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఆమెను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







