వినియోగ వస్తువుల ధరలను తనిఖీ చేసిన సౌదీ అధికారులు
- October 10, 2022
రియాద్: అక్టోబర్ మొదటి వారంలో కింగ్డమ్లోని అన్ని ప్రాంతాలలోని మార్కెట్లలో వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించడానికి 18,000 కంటే ఎక్కువ పర్యటనలు చేసినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ పర్యటనలో భాగంగా విక్రయ కేంద్రాలలో వస్తువులు, ఉత్పత్తుల ధరలను తమ బృందాలు 29,000 తనిఖీలను నిర్వహించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 278 ప్రాథమిక వస్తువుల ధరను, ఛార్జీలను కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా వాటిని ఎలక్ట్రానిక్ సిస్టమ్లోకి అప్లోడ్ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు వీలుగా వస్తువుల ధరల స్థాయిలను పర్యవేక్షించడానికి ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది. వాణిజ్యపరమైన ఉల్లంఘనలను ఏకీకృత నంబర్ 1900 లేదా “బలాగ్ తిజారీ” (వాణిజ్య నివేదిక) యాప్ ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







