60 రోజుల టూరిస్ట్ వీసాల జారీని పునఃప్రారంభించిన యూఏఈ
- October 10, 2022
యూఏఈ: 60 రోజుల విజిట్ వీసాల జారీని యూఏఈ పున:ప్రారంభించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 3 నుండి అమల్లోకి వచ్చిన అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్ అని పిలువబడే విస్తృత సంస్కరణల్లో ఇది ఒక భాగం అని పేర్కొంది. యూఏఈ అతిపెద్ద రెసిడెన్సీ, ఎంట్రీ పర్మిట్ సంస్కరణల్లో భాగంగా అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్లో యూఏఈ కేబినెట్ ప్రకటించిన వివరాల ప్రకారం.. అన్ని ప్రవేశ వీసాలు వాటి జారీ తేదీ నుండి 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. కొత్త ప్రవేశ అనుమతులలో ఉద్యోగ అన్వేషణ ప్రవేశ వీసా, వ్యాపారం కోసం వచ్చేవారు, ఐదు సంవత్సరాల బహుళ-ప్రవేశ పర్యాటక వీసా, బంధువులు లేదా స్నేహితులను సందర్శించడానికి, తాత్కాలిక పని కోసం, చదువులు/శిక్షణ కోసం వచ్చే వారికి వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 60 రోజుల విజిట్ వీసా జారీ ప్రారంభమైందని, ఈ వీసా కోసం క్లయింట్ల దగ్గర్నుంచి Dh500 వసూలు చేస్తున్నట్లు స్మార్ట్ ట్రావెల్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







