దుబాయ్లో దీపావళి వేడుకలు: బంగారం, అపార్ట్మెంట్ను గెలుచుకోండి
- October 11, 2022
దుబాయ్: Covid-19 తర్వాత దుబాయ్ నివాసితులు వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో దీపావళిని భారీ స్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రత్యక్ష పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. దీనితోపాటు ఈ వేడుకల్లో పాల్గొనే వారు ఒక సంవత్సరం పాటు అద్దె రహిత అపార్ట్మెంట్ను గెలుచుకునే అవకాశంతోపాటు 10 మంది విజేతలు 50 గ్రాముల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉన్నది. ఈ మెగా వేడుక వివరాలను అల్ సీఫ్ హెరిటేజ్ ప్రాంతంలో భారత కాన్సుల్ జనరల్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు. ఫెస్టివల్ ప్లాజా, సిటీ సెంటర్ దీరా, బర్ జుమాన్ మాల్, ఒయాసిస్ మాల్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ వంటి వివిధ షాపింగ్ మాల్స్, ఇతర ప్రదేశాలలో దీపావళి దుబాయ్ వేడుకల్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయని రిటైల్ రిజిస్ట్రేషన్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (DFRE) డైరెక్టర్ మహమ్మద్ ఫెరాస్ తెలిపారు. సాంకేతికత దీపావళి వంటి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని దుబాయ్లోని భారత కాన్సుల్-జనరల్ డాక్టర్ అమన్ పూరి అన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్లో భారతీయ కంపెనీలతో పెద్ద మొత్తంలో ట్రాక్షన్ను చూస్తున్నామని, వారిలో చాలా మంది ఈ దీపావళి పండుగకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారని పూరి తెలిపారు.


తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









