నయన తార ఫ్యాన్స్కి టార్గెట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి.!
- October 11, 2022
సీనియర్ హీరోయిన్ కస్తూరికి కాంట్రవర్సీలంటే పాపం భలే ఇష్టంలే. కెలుక్కుని మరీ అప్పుడప్పుడూ కాంట్రవర్సీల్లో దూరుతూ వుంటుంది. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కస్తూరి, ఇప్పుడు సీరియల్స్తో బుల్లితెరపై బిజీగా గడుపుతోంది.
అప్పుడప్పుడూ వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో, ఇలా కెలికి మరీ తిట్టించుకుంటుంది. తాజాగా కస్తూరిని నయన తార ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అసలు విషయంలోకి వెళితే, సోషల్ మీడియాలో కస్తూరి చాలా యాక్టివ్. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చట్టబద్ధం కాదు.. అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇప్పుడీ పోస్ట్తోనే నయన్ ఫ్యాన్స్కి కస్తూరి టార్గెట్ అయ్యింది. అదేంటీ.! ఈ ట్వీట్కీ, నయన తారకీ సంబంధమేంటీ.? అంటారా.! రీసెంట్గా నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు తల్లితండ్రులు అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియ జేశారు నయన్, విఘ్నేష్ దంపతులు. ఈ ట్వీట్ వచ్చిన కొన్ని గంటలకే కస్తూరి ఇలా ట్వీట్ చేయడంతో మరి, నయన్ ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది. హాయిగా ఆవిడ పనేదో ఆవిడ చూసుకోకుండా, ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఎందుకు.? అంటూ ఇంత సాప్ఠ్గా కాదండోయ్. బూతులు తిడుతూ నెటిజన్లు కస్తూరిని ఆడి పోసుకుంటున్నారు. ఇదే మరి, కెలికి మరీ బూతులు తిట్టించుకోవడమంటే.!
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







