నయన తార ఫ్యాన్స్కి టార్గెట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి.!
- October 11, 2022
సీనియర్ హీరోయిన్ కస్తూరికి కాంట్రవర్సీలంటే పాపం భలే ఇష్టంలే. కెలుక్కుని మరీ అప్పుడప్పుడూ కాంట్రవర్సీల్లో దూరుతూ వుంటుంది. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కస్తూరి, ఇప్పుడు సీరియల్స్తో బుల్లితెరపై బిజీగా గడుపుతోంది.
అప్పుడప్పుడూ వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో, ఇలా కెలికి మరీ తిట్టించుకుంటుంది. తాజాగా కస్తూరిని నయన తార ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అసలు విషయంలోకి వెళితే, సోషల్ మీడియాలో కస్తూరి చాలా యాక్టివ్. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చట్టబద్ధం కాదు.. అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇప్పుడీ పోస్ట్తోనే నయన్ ఫ్యాన్స్కి కస్తూరి టార్గెట్ అయ్యింది. అదేంటీ.! ఈ ట్వీట్కీ, నయన తారకీ సంబంధమేంటీ.? అంటారా.! రీసెంట్గా నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు తల్లితండ్రులు అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియ జేశారు నయన్, విఘ్నేష్ దంపతులు. ఈ ట్వీట్ వచ్చిన కొన్ని గంటలకే కస్తూరి ఇలా ట్వీట్ చేయడంతో మరి, నయన్ ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది. హాయిగా ఆవిడ పనేదో ఆవిడ చూసుకోకుండా, ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఎందుకు.? అంటూ ఇంత సాప్ఠ్గా కాదండోయ్. బూతులు తిడుతూ నెటిజన్లు కస్తూరిని ఆడి పోసుకుంటున్నారు. ఇదే మరి, కెలికి మరీ బూతులు తిట్టించుకోవడమంటే.!
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







