ప్రవాసులకు ‘గోల్డెన్ పెన్షన్’ ప్రకటించిన యూఏఈ
- October 11, 2022
యూఏఈ: జాతీయులు, నివాసితుల కోసం ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి నేషనల్ బాండ్లు యూఏఈలో గోల్డెన్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించాయి. యజమానులు, ఉద్యోగుల నుండి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పెన్షన్ స్కీమ్ ను అభివృద్ధి చేసినట్లు యూఏఈ ప్రముఖ షరియా-కంప్లైంట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తెలిపింది. కొత్త ప్రతిపాదన నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు నెలవారీ ప్రాతిపదికన Dh100 ఆదా చేయొచ్చు. దీనిద్వారా అదనపు లాభాన్ని పొందుతారని, ఇది వారి సంస్థ అందించే గ్రాట్యుటీకి అదనంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. నేషనల్ బాండ్స్తో రిజిస్టర్ అయిన కార్పొరేట్లకు తమ ఉద్యోగుల ఆర్థిక లక్ష్యాలకు తోడ్పాటు అందించడం ఈ విశిష్ట పథకం అందుబాటులో ఉంటుందన్నారు. యూఏఈ జనాభాలో 89 శాతం నిర్వాసితులను లక్ష్యంగా చేసుకున్న ఈ పథకం కింద నేషనల్ బాండ్లు అందించే ఆకర్షణీయమైన రిటర్న్స్ ఇస్తుందని దుబాయ్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యాజమాన్యంలోని నేషనల్ బాండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







