ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- November 03, 2025
యూఏఈ: యూఏఈలో వ్యాప్తంగా యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అబుదాబిలోని ఖాసర్ అల్ హోస్న్లో యూఏఈ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూఏఈ డిఫెన్స్ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. జెండా దినోత్సవం అనేది మనల్ని ఏకం చేసి ఉమ్మడి బాధ్యతను గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అన్నారు. అందరూ కలిసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మెలగాలని పిలుపునిచ్చారు.
షేక్ జాయెద్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజును సూచిస్తూ యూఏఈ జాతీయ దినోత్సవం (ఇప్పుడు ఈద్ అల్ ఎతిహాద్ అని పిలుస్తారు) డిసెంబర్ 2, 1971న జరుపుకుంటారు. అయితే యూఏఈ జెండా దినోత్సవాన్ని దేశ రెండవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పట్టాభిషేకం జరిగిన నవంబర్ 3న జరుపుకుంటారు.
నవంబర్ 3 నుండి డిసెంబర్ 2 వరకు నెల రోజులను నేషనల్ మంత్ గా జరుపుకుంటారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 11, 2012న జెండా దినోత్సవాన్ని ప్రకటించారు. దీనిని మొదటిసారిగా 2013లో జరుపుకున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







