ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- November 03, 2025
యూఏఈ: యూఏఈలో వ్యాప్తంగా యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అబుదాబిలోని ఖాసర్ అల్ హోస్న్లో యూఏఈ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూఏఈ డిఫెన్స్ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. జెండా దినోత్సవం అనేది మనల్ని ఏకం చేసి ఉమ్మడి బాధ్యతను గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అన్నారు. అందరూ కలిసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మెలగాలని పిలుపునిచ్చారు.
షేక్ జాయెద్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజును సూచిస్తూ యూఏఈ జాతీయ దినోత్సవం (ఇప్పుడు ఈద్ అల్ ఎతిహాద్ అని పిలుస్తారు) డిసెంబర్ 2, 1971న జరుపుకుంటారు. అయితే యూఏఈ జెండా దినోత్సవాన్ని దేశ రెండవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పట్టాభిషేకం జరిగిన నవంబర్ 3న జరుపుకుంటారు.
నవంబర్ 3 నుండి డిసెంబర్ 2 వరకు నెల రోజులను నేషనల్ మంత్ గా జరుపుకుంటారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 11, 2012న జెండా దినోత్సవాన్ని ప్రకటించారు. దీనిని మొదటిసారిగా 2013లో జరుపుకున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









