గాయపడిన కార్పెంటర్ కు Dh350,000 పరిహారం
- October 12, 2022
యూఏఈ: ఎలక్ట్రిక్ రంపంతో పనిచేసే సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆసియాకు చెందిన ఓ కార్పెంటర్ కు Dh350,000 పరిహారం చెల్లించాలన్న అబుధాబి సివిల్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది. ఆసియా కార్మికుడిని నియమించిన వడ్రంగి కంపెనీని బాధితుడికి పరిహారం చెల్లించమని ఆదేశించింది. కంపెనీ నిర్లక్ష్యం, భద్రతా నియమాలను ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విద్యుత్ రంపాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఏర్పడ్డ గాయాల కారణంగా తనకు శాశ్వత వైకల్యం ఏర్పడిందని, దీంతో పని చేయలేకపోవడం వల్ల మానసికంగా, భౌతికంగా నష్టపోయానని.. పరిహారంగా తనకు 2 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికుడు కంపెనీపై దావా వేశాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు నేరం రుజువైన తర్వాత క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కంపెనీకి గతంలో 7,000 దిర్హామ్లు జరిమానా విధించింది. క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి, నష్టపరిహారం కోసం తన యజమానిపై సివిల్ దావా వేయాలని కార్మికుడికి సూచించారు. అనంతరం సివిల్ కేసును విచారించిన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నష్టపరిహారంగా కార్మికుడికి Dh350,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తీర్పును సమర్థించింది. దాంతోపాటు కార్మికునికి చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!









