అల్ ఖోర్ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
- October 12, 2022
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్సిసి) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన అల్ ఖోర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఖతార్ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్-థానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కొత్త ఆరోగ్య కేంద్రంలోని వార్డులను తిరిగి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆరోగ్య, ఆరోగ్య సౌకర్యాలను అందించే సరికొత్త వైద్య సాంకేతికతలతో కూడిన ప్రత్యేక క్లినిక్లు, విభాగాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నూతన ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి కూడా ఆయన ఆరా తీశారు. HE ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రితో పాటు ప్రజారోగ్య మంత్రి HE డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి, ఆరోగ్య రంగంలోని అనేకమంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన మంత్రి అబ్దుల్ అజీజ్ అల్-థానీ మాట్లాడుతూ.. పౌరులు, నివాసితులకు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ప్రాథమిక సంరక్షణ సేవలను అందించే ఆరోగ్య కేంద్రాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. కొత్త అల్ ఖోర్ ఆరోగ్య కేంద్రం 5,000 మంది రోగులకు సేవలు అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







