అనుపమ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!
- October 13, 2022
‘డీజె టిల్లు’ అంటూ కరోనా ప్యాండమిక్ టైమ్లో ధియేటర్లో సందడి చేసిన సినిమాకి యూత్ నుంచి అనూహ్యంగా క్రేజ్ దక్కింది.చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సిద్దు జొన్నల గడ్డ, నేహాశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ విజయం అందుకుంది.
ఈ సినిమాలోని కామెడీ కానీ, పాటలు కానీ ఓ ఊపు ఊపేశాయని చెప్పొచ్చు. దాంతో, ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని యూనిట్ భావించింది. ఆ ఊపు చల్లారకుండానే, సీక్వెల్ ప్లాన్ చేసేశారు ‘టిల్లు’ అండ్ టీమ్.
విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీక్వెల్ కోసం బడ్జెట్ లెక్కలు కూడా పెంచేశారు. అంతా బాగానే వుంది. కానీ, సీక్వెల్ని మొదటి పార్ట్ నటీనటులతోనే తెరకెక్కిస్తారా.? అంటే, హీరోయిన్ని మార్చేయాలని డిసైడ్ అయ్యారట. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఆ నోటా ఈ నోటా ఆ గాసిప్ బయటికి వచ్చేసింది.
దాంతో సెకండ్ పార్ట్లో హీరోయిన్ రాధిక పాత్రలో కనిపించే ఆ హీరోయిన్ ఎవరంటూ ఆరా మొదలయ్యింది. లేటెస్టుగా సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ ఆరాకి సమాధానం దొరికినట్లైంది. టిల్లుగాడితో అనుపమ పరమేశ్వరన్ జత కట్టబోతోందని చిన్న ఉప్పందింది.
తన అకౌంట్లో అనుపమ పరమేశ్వరన్ ఫోటోని షేర్ చేయడమే ఆ ఉప్పు. ‘టిల్లుగాడితో అట్లుంటది..’ అని రాసి వున్న టీషర్ట్ని ధరించిన అనుపమ ఫోటోని పోస్ట్ చేసి, ‘యు ఆర్ సో బ్యూటిఫుల్ అను’ అని పోస్ట్ పెట్టాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక, అంతే, ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే అంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఒకవేళ అదే జరిగితే, అనుపమ మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసినట్లే. రీసెంట్గా ‘కార్తికేయ 2’తో హిట్టు కొట్టిన అను, రెండో టిల్లుగానికి కూడా లక్కీ ఛామ్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







