అనుపమ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!
- October 13, 2022
‘డీజె టిల్లు’ అంటూ కరోనా ప్యాండమిక్ టైమ్లో ధియేటర్లో సందడి చేసిన సినిమాకి యూత్ నుంచి అనూహ్యంగా క్రేజ్ దక్కింది.చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సిద్దు జొన్నల గడ్డ, నేహాశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ విజయం అందుకుంది.
ఈ సినిమాలోని కామెడీ కానీ, పాటలు కానీ ఓ ఊపు ఊపేశాయని చెప్పొచ్చు. దాంతో, ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని యూనిట్ భావించింది. ఆ ఊపు చల్లారకుండానే, సీక్వెల్ ప్లాన్ చేసేశారు ‘టిల్లు’ అండ్ టీమ్.
విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీక్వెల్ కోసం బడ్జెట్ లెక్కలు కూడా పెంచేశారు. అంతా బాగానే వుంది. కానీ, సీక్వెల్ని మొదటి పార్ట్ నటీనటులతోనే తెరకెక్కిస్తారా.? అంటే, హీరోయిన్ని మార్చేయాలని డిసైడ్ అయ్యారట. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఆ నోటా ఈ నోటా ఆ గాసిప్ బయటికి వచ్చేసింది.
దాంతో సెకండ్ పార్ట్లో హీరోయిన్ రాధిక పాత్రలో కనిపించే ఆ హీరోయిన్ ఎవరంటూ ఆరా మొదలయ్యింది. లేటెస్టుగా సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ ఆరాకి సమాధానం దొరికినట్లైంది. టిల్లుగాడితో అనుపమ పరమేశ్వరన్ జత కట్టబోతోందని చిన్న ఉప్పందింది.
తన అకౌంట్లో అనుపమ పరమేశ్వరన్ ఫోటోని షేర్ చేయడమే ఆ ఉప్పు. ‘టిల్లుగాడితో అట్లుంటది..’ అని రాసి వున్న టీషర్ట్ని ధరించిన అనుపమ ఫోటోని పోస్ట్ చేసి, ‘యు ఆర్ సో బ్యూటిఫుల్ అను’ అని పోస్ట్ పెట్టాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక, అంతే, ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే అంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఒకవేళ అదే జరిగితే, అనుపమ మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసినట్లే. రీసెంట్గా ‘కార్తికేయ 2’తో హిట్టు కొట్టిన అను, రెండో టిల్లుగానికి కూడా లక్కీ ఛామ్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







