ప్రవాస కార్మికులు లీగల్ స్టేటస్ ధృవీకరించుకోవాలి: ఎల్ఎంఆర్ఏ
- October 13, 2022
మనామా: బహ్రెయిన్ రాజ్యంలో ఉన్న ప్రవాస కార్మికులందరూ తమ హక్కులను కాపాడుకోవడానికి లీగల్ స్టేటస్ ని ధృవీకరించుకోవాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) పిలుపునిచ్చింది. రెసిడెన్సీ చట్టాలతో సహా రాజ్యంలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలను కార్మికులు పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అథారిటీ గుర్తుచేసింది. కార్మికుడు రాజ్యంలోకి రాకముందే తమ యజమాని నుండి అధికారిక వర్క్ పర్మిట్ను పొందాలని సూచించింది. విజిట్ వీసాపై చట్టవిరుద్ధంగా ఉద్యోగంలో చేరితే.. అలాంటి వారికి భారీ జరిమానాలతోపాటు బహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరించింది. ప్రవాస కార్మికులు మొదటిసారిగా రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక నెలలోగా బయోమెట్రిక్ డేటాను అథారిటీకి అందించడంతో పాటు, వర్క్ పర్మిట్కు సంబంధించిన అన్ని చట్టపరమైన విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుందని LMRA స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా ఖర్చులతో సహా కార్మికునిపై విధించిన అన్ని రుసుములను యజమాని భరించాలని చట్టం చెబుతుందని, వర్క్ పర్మిట్ జారీ లేదా పునరుద్ధరణకు బదులుగా యజమానికి ఏదైనా డబ్బు లేదా ప్రయోజనాలను అందించకుండా కార్మికుడిని నిషేధిస్తున్నట్లు తెలిపే నిబంధనలను అథారిటీ గుర్తు చేసింది. ప్రవాస వర్కర్ బదిలీ బదిలీ పూర్తయ్యే వరకు.. కొత్త యజమాని కింద కొత్త వర్క్ పర్మిట్ జారీ చేయబడే వరకు ప్రస్తుత యజమాని వద్ద పని చేయడం మానేయాలని కార్మికులకు LMRA సూచించింది. ఏమైనా సమస్యలు తలెత్తిన పక్షంలో కార్మికులు తమకు నిర్దేశించిన కేంద్రాలలో సంప్రదించాలని అథారిటీ సూచించింది. అనేక భాషల్లో 24 గంటలూ పని చేసే హాట్లైన్ 995లో ప్రవాస కార్మికుల రక్షణ, సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







