ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు
- October 15, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో అటెండెన్స్, స్టూడెంట్స్ స్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఫోర్జరీకి పాల్పడిన టీచర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత ఆ టీచర్ ను నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే 2018 లో బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో పిల్లల అటెండెన్స్ రిపోర్ట్ ను ఫోర్జరీ చేశాడు. అదే విధంగా స్టడీ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా చూపుతూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ విద్యాశాఖ కు కంప్లైంట్ చేశాడు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో టీచర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో దోషిగా తేలటంతో ఆ టీచర్ కు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









