ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు
- October 15, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో అటెండెన్స్, స్టూడెంట్స్ స్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఫోర్జరీకి పాల్పడిన టీచర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత ఆ టీచర్ ను నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే 2018 లో బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో పిల్లల అటెండెన్స్ రిపోర్ట్ ను ఫోర్జరీ చేశాడు. అదే విధంగా స్టడీ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా చూపుతూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ విద్యాశాఖ కు కంప్లైంట్ చేశాడు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో టీచర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో దోషిగా తేలటంతో ఆ టీచర్ కు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







