ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు
- October 15, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో అటెండెన్స్, స్టూడెంట్స్ స్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఫోర్జరీకి పాల్పడిన టీచర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత ఆ టీచర్ ను నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే 2018 లో బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో పిల్లల అటెండెన్స్ రిపోర్ట్ ను ఫోర్జరీ చేశాడు. అదే విధంగా స్టడీ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా చూపుతూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ విద్యాశాఖ కు కంప్లైంట్ చేశాడు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో టీచర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో దోషిగా తేలటంతో ఆ టీచర్ కు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









