రానా డైరెక్టర్తో చైతూ పొలిటికల్ డ్రామా నిజమేనా.?
- October 15, 2022
రానా, సాయి పల్లవి జంటగా ‘విరాట పర్వం’ సినిమా విడుదలకు ముందు ఏ స్థాయిలో సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ఒకింత నెగిటివిటీ మూట కట్టుకున్నా, కంటెంట్ పరంగా సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ వేణు ఉడుగుల ఓ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ని సిద్ధం చేశాడట. అందుకోసం హీరోగా నాగ చైతన్యను తీసుకోవాలనుకుంటున్నాడనీ ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
ఇటీవలే ‘సీతారామం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని లాభాల్ని దక్కించుకున్న వైజయంతీ మూవీస్, ఇప్పుడు నాగ చైతన్య సినిమాని భారీ బడ్జెట్తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రబాస్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు నాగ చైతన్య, తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రియమణి ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







