త్వరలోనే ఇండియా-గల్ఫ్ సెక్టార్లో జెట్ ఎయిర్వేస్ సర్వీసులు!
- October 17, 2022
దుబాయ్: దాదాపు మూడు సంవత్సరాల అనంతరం భారతదేశం-గల్ఫ్ సెక్టార్లో జెట్ ఎయిర్వేస్ తన కార్యాకలాపాలను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్ కొత్త మేనేజ్మెంట్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన విమాన తయారీదారులతో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొదటగా ఐదు విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం అయినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నారు. ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్.. దాని వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ దివాలా తీసి 2019లో కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్, కల్రాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ ఫ్లోరియన్ ఆధ్వర్యంలోని కల్రాక్ క్యాపిటల్-మురారి లాల్ జలాన్ కన్సార్టియం ఎయిర్లైన్స్ కు మూలధనాన్ని సమకూర్చడానికి రుణదాతలతో ఒప్పందాన్ని చేసుకోవడంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







