బహ్రెయిన్లో సంయుక్త తనిఖీలు ప్రారంభం
- October 17, 2022
మనామా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు సహకారంతో క్యాపిటల్ గవర్నరేట్లో సంయుక్త తనిఖీలను ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడంతోపాటు వారిపై బహిష్కరణ ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని సొసైటీ సభ్యులందరికీ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







