వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
- October 17, 2022
అమరావతి: రైతులకు వైస్సార్ రైతు భరోసా పథకం ద్వారా జగన్ సర్కార్ తోడుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వైయస్ఆర్ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.4 వేల సాయాన్ని అందజేస్తున్న జగన్.. వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని అందజేశారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసారు. 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేసారు. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండవ విడతగా అక్టోబర్లో రూ.4వేలు.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అకౌంట్లలో జమ చేస్తోంది.
ఇక వైస్సార్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు చేరుకున్న సీఎం జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. రైతులతో ముచ్చటించారు. వారితో ఫొటో దిగారు. సభా వేదికపై దివంగత మహానేత వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







