వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
- October 17, 2022
అమరావతి: రైతులకు వైస్సార్ రైతు భరోసా పథకం ద్వారా జగన్ సర్కార్ తోడుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వైయస్ఆర్ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.4 వేల సాయాన్ని అందజేస్తున్న జగన్.. వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని అందజేశారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసారు. 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేసారు. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండవ విడతగా అక్టోబర్లో రూ.4వేలు.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అకౌంట్లలో జమ చేస్తోంది.
ఇక వైస్సార్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు చేరుకున్న సీఎం జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. రైతులతో ముచ్చటించారు. వారితో ఫొటో దిగారు. సభా వేదికపై దివంగత మహానేత వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









