ఈ నెల 24న దీపావళి సెలవు దినం..
- October 20, 2022హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ నెల 24(సోమవారం)ను సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీపావళి ఎప్పుడన్న విషయంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. చివరకు సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 25న (మంగళవారం) అమావాస్య అని క్యాలెండర్లలో ఉంది. దీపావళిని ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు.
దీపావళిని ప్రదోష వేళ (సూర్యాస్తమయ సమయంలో) నిర్వహిస్తారు. ఈ నెల 25నే అమావాస్య తిథి ఉన్నప్పటికీ ప్రదోష వేళ వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయని పండితులు అంటున్నారు. 25న సాయంత్రం 4.25 గంటల లోపు అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేస్తుందని చెబుతున్నారు. దీంతో సూర్యాస్తమయానికి అమావాస్య ఉండడం లేదని, 24న సాయంత్రం 4.25 గంటల సమయానికి అమావాస్య ప్రారంభమవుతోందని వివరించారు.
పండితులు సైతం దీపావళిని 24నే జరుపుకోవాలని అంటుండడంతో ఆ రోజునే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 24నే ధనలక్ష్మి పూజలు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని చాలా మంది జరుపుకుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేకపోవడంతో మరుసటి రోజు వ్రతం జరుపుకోవాల్సి ఉండగా, కానీ 25న సూర్యగ్రహణం ఉండడంతో అందుకు వీలు ఉండదు. గ్రహణం విడిచిన అనంతరం సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు చెప్పారు. అయితే, పండుగ రోజే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉండడంతో 24నే వ్రతం చేసుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..