అబుధాబి విమానాశ్రయంలో సిటీ చెక్-ఇన్ సర్వీసులు పునఃప్రారంభం
- October 22, 2022
అబుధాబి : దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత.. కీలక శీతాకాల ప్రయాణ సీజన్కు ముందు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం సిటీ చెక్-ఇన్ సేవను మళ్లీ ప్రారంభించింది. జాయెద్ పోర్ట్లోని అబుధాబి క్రూయిస్ టెర్మినల్ టెర్మినల్ 1 వద్ద ప్రయాణీకుల కోసం చెక్-ఇన్ సేవ ప్రారంభించినట్లు.. ప్రస్తుతం ఎతిహాద్ ఎయిర్వేస్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే ఈ సేవను పొందగలరని ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలియజేశాయి. ప్రయాణీకులు బయలుదేరడానికి 24 గంటల నుండి నాలుగు గంటల ముందు వరకు చెక్ ఇన్ చేయవచ్చన్నారు. ప్రయాణికులు తమ బ్యాగేజీని ముందుగానే చెక్ ఇన్ చేయడంతోపాటు బోర్డింగ్ పాస్లను స్వీకరించవచ్చని ఎయిర్ పోర్ట్ వర్గాలు వివరించారు. అల్ జహియా ప్రాంతంలోని సిటీ టెర్మినల్ ను 2019 అక్టోబర్ లో అబుధాబి విమానాశ్రయం మూసివేసిన విషయం తెలిసిందే. చెక్-ఇన్ ఛార్జీలు పెద్దలకు 45 దిర్హామ్లు, పిల్లలకి 25 దిర్హామ్లు, శిశువుకు 15 దిర్హామ్లు, నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం Dh120 చెల్లించి ఈ సేవను పొందవచ్చు. టెర్మినల్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు పనిచేస్తుంది. పబ్లిక్ బస్సులు నంబర్ 9 (మెరీనా మాల్ నుండి), 44 (ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ క్లబ్ నుండి) క్రూయిజ్ టెర్మినల్కు నడుస్తాయి. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు 02 5833345కు కాల్ చేయవచ్చని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







