వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు!

- October 23, 2022 , by Maagulf
వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు!

సౌదీ: సౌదీ అరేబియా ప్రధాన మంత్రి,  యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.  సౌదీ క్రౌన్ ప్రిన్స్ బాలి (ఇండోనేషియా)లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే సమయంలో నవంబర్ 14న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు ఒకరోజు పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ గత వారం భారతదేశాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com