హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే బహిష్కరణే.. ప్రవాసులను హెచ్చరించిన కువైట్
- October 28, 2022
కువైట్: భద్రతను పెంచడానికి కువైట్ చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలు, మరేదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బహిష్కరణ కేసులకు మంత్రిత్వ శాఖ లేదా అండర్ సెక్రటరీ నుండి నిర్ణయం అవసరం లేదని.. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని చట్టం చెబుతోందని, ఈ చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కాదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల హవల్లి, మహబౌలా, సాల్మియా, అల్-రెగ్గే ప్రాంతాల్లో హింసాత్మక ప్రవర్తనలు పెరగడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే బహిష్కరణకు గురైన వారు దోషులుగా తేలితే జరిగిన నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







