హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే బహిష్కరణే.. ప్రవాసులను హెచ్చరించిన కువైట్
- October 28, 2022
కువైట్: భద్రతను పెంచడానికి కువైట్ చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలు, మరేదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బహిష్కరణ కేసులకు మంత్రిత్వ శాఖ లేదా అండర్ సెక్రటరీ నుండి నిర్ణయం అవసరం లేదని.. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని చట్టం చెబుతోందని, ఈ చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కాదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల హవల్లి, మహబౌలా, సాల్మియా, అల్-రెగ్గే ప్రాంతాల్లో హింసాత్మక ప్రవర్తనలు పెరగడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే బహిష్కరణకు గురైన వారు దోషులుగా తేలితే జరిగిన నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









