హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే బహిష్కరణే.. ప్రవాసులను హెచ్చరించిన కువైట్

- October 28, 2022 , by Maagulf
హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే బహిష్కరణే.. ప్రవాసులను హెచ్చరించిన కువైట్

కువైట్: భద్రతను పెంచడానికి కువైట్ చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలు, మరేదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బహిష్కరణ కేసులకు మంత్రిత్వ శాఖ లేదా అండర్ సెక్రటరీ నుండి నిర్ణయం అవసరం లేదని.. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని చట్టం చెబుతోందని, ఈ చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కాదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల హవల్లి, మహబౌలా, సాల్మియా, అల్-రెగ్గే ప్రాంతాల్లో హింసాత్మక ప్రవర్తనలు పెరగడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే బహిష్కరణకు గురైన వారు దోషులుగా తేలితే జరిగిన నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com