హరమైన్ రైలు సేవలు పునఃప్రారంభం
- October 28, 2022
జెడ్డా: హరమైన్ హై స్పీడ్ రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గత కొంతకాలంగా టెక్నికల్ సమస్యల కారణంగా సాధారణ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు అధికారులు తెలిపారు. మక్కా, మదీనాల మధ్య జెడ్డా, రబీగ్ మీదుగా తన సేవలను పునరుద్ధరించినట్లుహరమైన్ రైలును నిర్వహిస్తున్న సౌదీ-స్పానిష్ రైలు ప్రాజెక్ట్ కంపెనీ వెల్లడించింది. సేవల నిలుపుదల కారణంగా ప్రభావితమైన ప్రయాణికులందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అలాగే కంపెనీ విధానాల ప్రకారం బాధితులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా జెడ్డా, మదీనా మధ్య నిర్వహించాల్సిన అనేక ట్రిప్పులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









