బాలయ్య వందో చిత్రo ని కి తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఇన్విటేషన్...

- April 21, 2016 , by Maagulf
బాలయ్య వందో చిత్రo ని కి తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఇన్విటేషన్...

బాలయ్య వందో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రిష్ తెరకెక్కించనుండగా, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళే ముహూర్తపు తేదిని ఫిక్స్ చేసారు. ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 22న ఉదయం గం.10:27ని.లకు ఈ లాంఛింగ్ కార్యక్రమం భారీ ఎత్తున జరగనున్నట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వనితులుగా తెలంగాణ సిఎం కేసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.గౌతమ్ పుత్ర శాతకర్ణిగా బాలయ్య తన వందో చిత్రంలో కనిపించనుండగా, ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రతీ ఒక్కరు ఈ మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక గత కొన్ని రోజులు నుండి బాలయ్య కూడా అదే గెటప్‌లో కనిపిస్తుండడంతో అభిమానులలోను జోష్ పెరిగింది. అయితే ఇదిలా ఉండగా బాలయ్య తన మూవీ లాంఛింగ్ కార్యక్రమంకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలకు అందించిన ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొడుతుంది. దీనిపై మీరు ఓ లుక్కేయండి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com