బాలయ్య వందో చిత్రo ని కి తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఇన్విటేషన్...
- April 21, 2016
బాలయ్య వందో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రిష్ తెరకెక్కించనుండగా, ఈ చిత్రం సెట్స్పైకి వెళ్ళే ముహూర్తపు తేదిని ఫిక్స్ చేసారు. ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 22న ఉదయం గం.10:27ని.లకు ఈ లాంఛింగ్ కార్యక్రమం భారీ ఎత్తున జరగనున్నట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వనితులుగా తెలంగాణ సిఎం కేసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.గౌతమ్ పుత్ర శాతకర్ణిగా బాలయ్య తన వందో చిత్రంలో కనిపించనుండగా, ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రతీ ఒక్కరు ఈ మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక గత కొన్ని రోజులు నుండి బాలయ్య కూడా అదే గెటప్లో కనిపిస్తుండడంతో అభిమానులలోను జోష్ పెరిగింది. అయితే ఇదిలా ఉండగా బాలయ్య తన మూవీ లాంఛింగ్ కార్యక్రమంకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలకు అందించిన ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ సైట్స్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







