ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులు చేసిన షార్జా

- October 31, 2022 , by Maagulf
ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులు చేసిన షార్జా

యూఏఈ: ప్రవాసుల కోసం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్‌ చట్టం 2010లో షార్జా ఎమిరేట్ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు చట్టంలోని సవరణ నెం. (5) లో మార్పులు చేస్తూ  సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి చట్టం నెం. (2) 2022ని జారీ చేశారు. 2010 నాటి లా నంబర్ (5)లోని ఆర్టికల్ (4) ప్రకారం.. ఎమిరేట్‌లో రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకునే హక్కు యూఏఈ పౌరులు, జీసీసీ పౌరులకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే, ఈ చట్టానికి మినహాయింపుగా యాజమాన్య హక్కును ఇతరులకు బదిలీ చేసేందుకు తాజాగా వీలు కల్పించారు. పాలకుల ఆమోదం, చట్టపరమైన నోటిఫికేషన్, వారసత్వ బదిలీ, యజమాని తన మొదటి-స్థాయి బంధువులలో ఒకరికి ఇవ్వడం, మండలి నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రాంతాలు, ప్రాజెక్టులలో యాజమాన్యం హక్కులను బదిలీ చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com