గుజరాత్లో కేబుల్ వంతెన దుర్ఘటన: భారత్కు ఒమన్ సంతాపం
- October 31, 2022
మస్కట్: మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ వంతెన కూలిన ఘటనపై ఒమన్ సుల్తానేట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇండియాలోని గుజరాత్లో ఆదివారం సాయంత్రం కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో 140 మంది మరణించగా.. వందలాది మంది మచ్చు నదిలో పడి గాయపడ్డారు. వంతెన కూలిన సమయంలో దానిపై దాదాపు 350 మంది వరకు పర్యాటకులు ఉన్నారని, మృతుల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని అధికారులు తెలిపారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు మచ్చు నదిపై 230 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. 8 నెలలపాటు వంతెనకు పునరుద్ధరణ పనులు జరిపి అక్టోబర్ 26న కేబుల్ వంతెనను పర్యాటకుల కోసం తెరిచారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







