గుజరాత్లో కేబుల్ వంతెన దుర్ఘటన: భారత్కు ఒమన్ సంతాపం
- October 31, 2022
మస్కట్: మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ వంతెన కూలిన ఘటనపై ఒమన్ సుల్తానేట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇండియాలోని గుజరాత్లో ఆదివారం సాయంత్రం కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో 140 మంది మరణించగా.. వందలాది మంది మచ్చు నదిలో పడి గాయపడ్డారు. వంతెన కూలిన సమయంలో దానిపై దాదాపు 350 మంది వరకు పర్యాటకులు ఉన్నారని, మృతుల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని అధికారులు తెలిపారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు మచ్చు నదిపై 230 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. 8 నెలలపాటు వంతెనకు పునరుద్ధరణ పనులు జరిపి అక్టోబర్ 26న కేబుల్ వంతెనను పర్యాటకుల కోసం తెరిచారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్









