దుబాయ్ మెటా ఫిల్మ్ ఫెస్ట్: ‘ముత్తయ్య’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు
- October 31, 2022
దుబాయ్: దుబాయ్లో జరిగిన మెటా ఫిల్మ్ ఫెస్ట్ లో తెలుగు చలనచిత్రం ‘ముత్తయ్య’కి దర్శకత్వం వహించిన భాస్కర్ మౌర్య ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సంవత్సరం ఫెస్టివల్కి ఎంపికైన ఏకైక భారతీయ చలనచిత్రం ఇదే కావడం గమనార్హం. చనిపోయే ముందు సినిమాల్లో నటించాలని కలలు కనే ఓ 70 ఏళ్ల వృద్ధుడి కథతో ఈ చిత్రాన్ని భాస్కర్ మౌర్య తెరకెక్కించాడు.హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్స్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, బృందా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇరాన్, యూఏఈ, స్పెయిన్, యూఎస్ఏ, టర్కీ మొదలైన దేశాల చిత్రనిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్లతో కూడిన జ్యూరీని ముత్తయ్య చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. భాస్కర్ మౌర్య తరపున అవార్డును అందుకున్న బృందా ప్రసాద్.. జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో ముత్తయ్య చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు జ్యూరీకి, మెటా ఫిల్మ్ ఫెస్ట్ బృందానికి బృందా ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ముత్తయ్య చిత్రంలో కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, మౌనిక బొమ్మి, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్, కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







