దుబాయ్ మెటా ఫిల్మ్ ఫెస్ట్: ‘ముత్తయ్య’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు
- October 31, 2022
దుబాయ్: దుబాయ్లో జరిగిన మెటా ఫిల్మ్ ఫెస్ట్ లో తెలుగు చలనచిత్రం ‘ముత్తయ్య’కి దర్శకత్వం వహించిన భాస్కర్ మౌర్య ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సంవత్సరం ఫెస్టివల్కి ఎంపికైన ఏకైక భారతీయ చలనచిత్రం ఇదే కావడం గమనార్హం. చనిపోయే ముందు సినిమాల్లో నటించాలని కలలు కనే ఓ 70 ఏళ్ల వృద్ధుడి కథతో ఈ చిత్రాన్ని భాస్కర్ మౌర్య తెరకెక్కించాడు.హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్స్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, బృందా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇరాన్, యూఏఈ, స్పెయిన్, యూఎస్ఏ, టర్కీ మొదలైన దేశాల చిత్రనిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్లతో కూడిన జ్యూరీని ముత్తయ్య చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. భాస్కర్ మౌర్య తరపున అవార్డును అందుకున్న బృందా ప్రసాద్.. జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో ముత్తయ్య చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు జ్యూరీకి, మెటా ఫిల్మ్ ఫెస్ట్ బృందానికి బృందా ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ముత్తయ్య చిత్రంలో కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, మౌనిక బొమ్మి, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్, కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









