కువైట్ లో భారత రాయబారి సిబి జార్జ్ కి ఘనంగా వీడ్కోలు

- October 31, 2022 , by Maagulf
కువైట్ లో భారత రాయబారి సిబి జార్జ్ కి ఘనంగా వీడ్కోలు

కువైట్: భారత రాయబారి సిబి జార్జ్ తన పదవీకాలం ఆదివారంతో ముగిసింది.  ఈ సందర్భంగా ఎంబసీలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా తనకు సహకరించిన వారందరికి సిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం- కువైట్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి తన హయాంలో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి భార‌త‌దేశ సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసిందని జార్జ్ అన్నారు. కువైట్‌లోని చాలా కుటుంబాలు దశాబ్దాలుగా భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తజికిస్తాన్ రాయబారి డాక్టర్ జబిదుల్లా జబిడోవ్, ఉజ్బెకిస్తాన్ రాయబారి డాక్టర్ బహ్రోమ్ అలియోవ్, టోగో రాయబారి మొహమ్మద్ సాద్ ఓరో, మెక్సికో రాయబారి మిగ్యుల్ ఏంజెల్ ఇసిడ్రో, ఎంబసీ దౌత్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com