కువైట్ లో భారత రాయబారి సిబి జార్జ్ కి ఘనంగా వీడ్కోలు
- October 31, 2022
కువైట్: భారత రాయబారి సిబి జార్జ్ తన పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎంబసీలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా తనకు సహకరించిన వారందరికి సిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం- కువైట్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి తన హయాంలో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశ సంబంధాలను మరింత పటిష్టం చేసిందని జార్జ్ అన్నారు. కువైట్లోని చాలా కుటుంబాలు దశాబ్దాలుగా భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తజికిస్తాన్ రాయబారి డాక్టర్ జబిదుల్లా జబిడోవ్, ఉజ్బెకిస్తాన్ రాయబారి డాక్టర్ బహ్రోమ్ అలియోవ్, టోగో రాయబారి మొహమ్మద్ సాద్ ఓరో, మెక్సికో రాయబారి మిగ్యుల్ ఏంజెల్ ఇసిడ్రో, ఎంబసీ దౌత్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







