కువైట్ లో భారత రాయబారి సిబి జార్జ్ కి ఘనంగా వీడ్కోలు
- October 31, 2022
కువైట్: భారత రాయబారి సిబి జార్జ్ తన పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎంబసీలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా తనకు సహకరించిన వారందరికి సిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం- కువైట్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి తన హయాంలో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశ సంబంధాలను మరింత పటిష్టం చేసిందని జార్జ్ అన్నారు. కువైట్లోని చాలా కుటుంబాలు దశాబ్దాలుగా భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తజికిస్తాన్ రాయబారి డాక్టర్ జబిదుల్లా జబిడోవ్, ఉజ్బెకిస్తాన్ రాయబారి డాక్టర్ బహ్రోమ్ అలియోవ్, టోగో రాయబారి మొహమ్మద్ సాద్ ఓరో, మెక్సికో రాయబారి మిగ్యుల్ ఏంజెల్ ఇసిడ్రో, ఎంబసీ దౌత్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!









