‘బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్’కు అమృతస్వరూపానంద
- November 01, 2022
బహ్రెయిన్: మాతా అమృతానందమయి మఠం వైస్-ఛైర్మెన్, అమృత విశ్వ విద్యాపీఠం (అమృత విశ్వవిద్యాలయం) అధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి అమృతస్వరూపానంద పూరి “బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్: ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ హ్యూమన్ కోఎక్సిస్టెన్స్” కు హాజరు కానున్నారు. నవంబర్ 3-6 తేదీల్లో హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ బహ్రెయిన్ లో పర్యటించనున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా 200 మంది సర్వమత నాయకులతో “బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్: ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ హ్యూమన్ కోఎక్సిస్టెన్స్” ను నిర్వహించనున్నారు. స్వామి అమృతస్వరూపానంద పూరి ప్రఖ్యాత మానవతావాది. ప్రముఖ ఆధ్యాత్మిక నాయకురాలు శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ) ప్రధాన శిష్యుడు. 1970వ దశకం చివరి నుంచి అమృతపురి ఆశ్రమంలో ఆయన నివసిస్తున్నారు. తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అమృతస్వరూపానంద.. ప్రఖ్యాత రచయిత, అనువాదకుడు. ది ఇర్రెసిస్టిబుల్ అట్రాక్షన్ ఆఫ్ డివినిటీ (2019), ది కలర్ ఆఫ్ ది రెయిన్బో: కారుణ్య నాయకత్వం (2014), ‘అమ్మ’ జీవిత చరిత్ర తదితర 10 కంటే ఎక్కువ సంపుటాల సంభాషణలను ఇంగ్లిషులోకి అనువదించారు. అమృతస్వరూపానంద ఇప్పటివరకు 30 కంటే ఎక్కువ సార్లు ప్రపంచ దేశాలను చుట్టివచ్చారు.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







