దుబాయ్ రైడ్: భారత తొలి రాకెట్ ప్రయోగానికి నివాళులు
- November 07, 2022
యూఏఈ: ఈ సంవత్సరం నిర్వహించిన దుబాయ్ రైడ్లో భారతదేశం మొదటి రాకెట్ ప్రయోగానికి భారత ప్రవాస అజ్మల్ పోయాక్కర మహమూద్ నివాళులర్పించి నివాసితుల దృష్టిని ఆకర్షించాడు. తెల్లటి చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి 1963 నాటి ఛాయాచిత్రం జ్ఞాపకార్థం తన చక్రం వెనుక ఒక కోన్ లాంటి వస్తువును తీసుకువెళ్లాడు. ఇది భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష రాకెట్ను కేరళలోని తుంబ నుండి ప్రయోగానికి రవాణా చేయడాన్ని గుర్తుచేసింది. దీని గురించి అజ్మల్ పోయాక్కర మహమూద్ మాట్లాడుతూ.. నవంబర్ 1963లో తుంబా నుండి రాకెట్ ప్రయోగించబడింది. రోజువారీ కార్యకలాపాలు లేదా రాకెట్ ప్రయోగం వంటి చరిత్రను మార్చే సంఘటనల కోసం సైకిళ్లు ఎల్లప్పుడూ ప్రజల జీవితంలో ఎలా అంతర్భాగంగా ఉన్నాయో చాటి చెప్పాలనుకుని ఇలా చేశానన్నారు.
తుంబ రాకెట్ ప్రయోగం
మత్స్యకార గ్రామమైన తుంబా అయస్కాంత భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రదేశం. 1963 నవంబర్ లో రాకెట్ ప్రయోగానికి సరైన ప్రదేశంగా గుర్తించారు. ఆ స్థలంలో ఒక చిన్న చర్చి ఉంది. చర్చి బిషప్ తన సంఘం అనుమతితో అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ఆ చర్చిని విరాళంగా ఇచ్చారు. దీంతో బిషప్ ఇల్లు ఒక కార్యాలయంగా మారింది. చర్చి ఒక వర్క్షాప్గా రూపాంతరం చెందింది. పశువుల కొట్టాలు రాకెట్ సామాగ్రి నిల్వ కేంద్రాలు, ప్రయోగశాలలుగా ఉపయోగపడ్డాయి.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









