పర్వత శిఖరం నుండి పడిన యువకుడిని రక్షించిన రెడ్ క్రెసెంట్ బృందాలు
- November 07, 2022టబుక్ : వాయువ్య టబుక్ ప్రాంతంలో కపర్వత ప్రాంతంలో కొండపై నుండి పడిపోయిన సౌదీ యువకుడిని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు రక్షించాయి. గాయపడిన 30 ఏళ్ల పౌరుడిని తబుక్లోని కింగ్ సల్మాన్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తబుక్లోని అథారిటీ బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ నవాఫ్ అల్-అంజీ మాట్లాడుతూ.. శర్మ-తబుక్ రోడ్లోని కొండపై నుండి ఒక పౌరుడు పడిపోయినట్లు కమాండ్, కంట్రోల్ రూమ్కు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే అధికార నమీ సెంటర్ నుండి అంబులెన్స్ బృందం సంఘటనా స్థలానికి బయలుదేరిందన్నారు. సదరు యువకుడు చేరుకోవడం కష్టంగా ఉండే పర్వత ప్రాంతంలో చిక్కుకున్నట్లు గుర్తించి.. కఠినమైన పరిస్థితుల్లో రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. ఆ బృందం ఆ యువకుడిని రక్షించి, తబుక్లోని కింగ్ సల్మాన్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే టోల్-ఫ్రీ నంబర్ 997కి కాల్ చేసి అత్యవసర సేవను పొందాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!