విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
- November 08, 2022
అమరావతి: ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు సంబంధించిన లోగోను సిఎం జగన్ మంగళవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. 2023 మార్చి 2, 3, 4 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంతో పాటుగా ఆయా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
కరోనా కారణంగా గడచిన రెండేళ్లలో ఈ తరహా సదస్సులను నిర్వహించలేకపోయామని అమర్ నాథ్ తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగనే వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఎవరితో పడితే వారితో తమ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోదని చెప్పిన మంత్రి…. పెట్టుబడులు పెట్టే సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









