టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టు కీలక తీర్పు
- November 08, 2022
హైదరాబాద్: టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు… తాజాగా ఆ స్టేను ఎత్తి వేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
మొయినాబాద్ పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిశగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందజేచయగా… నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే నిందితుల కస్టడీకి తొలుత ఏసీబీ కోర్టు నిరాకరించగా… పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు… కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. తాజాగా దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. నిందితుల రిమాండ్ కు కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!







