కార్మికుల నియామకంలో అక్రమాలు.. కంపెనీ డైరెక్టర్కు Dh400,000 జరిమానా
- November 08, 2022
దుబాయ్: స్పాన్సర్షిప్ నిబంధనలను పాటించడంలో విఫలమైన దుబాయ్లోని ఓ మానవ వనరుల కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్కు దుబాయ్లోని నేచురలైజేషన్ అండ్ రెసిడెన్సీ కోర్టు Dh400,000 జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. దేశంలో అక్రమంగా ఉంటున్న ఏడుగురు కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమచారం మేరకు కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్ తన స్పాన్సర్షిప్ కింద లేని కార్మికులను నియమించినట్లు గుర్తించారు. ఈక్రమంలో స్పాన్సర్షిప్ నిబంధనలు ఉల్లంఘించిన కన్సల్టింగ్ డైరెక్టర్ కు కోర్టు పెనాల్టీ విధించింది. అలాగే మరొక స్పాన్సర్ వద్ద పనిచేసినందుకు, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్నందుకు ప్రతి కార్మికుడికి 1,000 దిర్హామ్ల జరిమానాను కోర్టు విధించింది. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









