కార్మికుల నియామకంలో అక్రమాలు.. కంపెనీ డైరెక్టర్కు Dh400,000 జరిమానా
- November 08, 2022
దుబాయ్: స్పాన్సర్షిప్ నిబంధనలను పాటించడంలో విఫలమైన దుబాయ్లోని ఓ మానవ వనరుల కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్కు దుబాయ్లోని నేచురలైజేషన్ అండ్ రెసిడెన్సీ కోర్టు Dh400,000 జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. దేశంలో అక్రమంగా ఉంటున్న ఏడుగురు కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమచారం మేరకు కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్ తన స్పాన్సర్షిప్ కింద లేని కార్మికులను నియమించినట్లు గుర్తించారు. ఈక్రమంలో స్పాన్సర్షిప్ నిబంధనలు ఉల్లంఘించిన కన్సల్టింగ్ డైరెక్టర్ కు కోర్టు పెనాల్టీ విధించింది. అలాగే మరొక స్పాన్సర్ వద్ద పనిచేసినందుకు, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్నందుకు ప్రతి కార్మికుడికి 1,000 దిర్హామ్ల జరిమానాను కోర్టు విధించింది. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







