అల్ మజ్రౌవా యార్డ్లో ఫిష్ ఎగ్జిబిషన్
- April 22, 2016
పెద్ద మొత్తంలో చేపలు మాంసాహార ప్రియులకు చవులూరించేలా చేస్తున్నాయి. అల్ మజ్రౌవా యార్డ్లో ప్రారంభమైన ఫిష్ ఎగ్జిబిషన్లో ఆకర్షించే ధరలతో చేపలు, మాంసాహార ప్రియులకోసం ఎదురుచూస్తున్నాయి. ఉమ్ సలాల్లోని అల్ మజ్రౌవా యార్డ్ దీనికి వేదికయ్యింది. మూడు రోజులపాటు ఈ ఫిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్థానిక ఫిషర్మెన్ చేపల్ని డైరెక్ట్గా విక్రయించేందుకు ఈ ఫిష్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశాయి. హేమర్, షారి, కింగ్ ఫిష్ సమా పలు రకాలైన చేపలు ఇక్కడ కొలువుదీరాయి. సముద్రం నుంచి నేరుగా, మార్కెట్లోకి చేపల్ని తీసుకొస్తున్నారు ఫిషర్మెన్. ఏప్రిల్, మే నెలల్లో సముద్రంలో చేపలు ఎక్కువగా దొరుకుతాయని ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెడ్ మొహమ్మద్ సయీద్ చెప్పారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపల్నే ఎగ్జిబిషన్లో విక్రయానికి ఉంచామని, వాటిపై స్పెషల్ ఇస్కౌంట్లు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కింగ్ ఫిష్ని ఫిషింగ్ నెట్ ద్వారా వేటాడటాన్ని జిసిసి దేశాలు నిషేధించాయి. ఈ నిషేధం కారణంగా ఆ సమయంలో చేపల సంతతి పెరగడానికి దోహదపడుతుంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









