ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ లో ఉపాధ్యాయులు, టాపర్లకు సన్మానం
- November 10, 2022
బహ్రెయిన్: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB)లో 2021-2022 CBSE X, XII పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారికి ఘనంగా సన్మానించారు. ఇసా టౌన్ క్యాంపస్లోని పాఠశాల ఆడిటోరియంలో నవంబర్ 7న జరిగిన వార్షిక అకడమిక్ అవార్డుల వేడుకల్లో దాదాపు 100 మంది టాపర్లను మెడల్స్, సర్టిఫికేట్లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు లాంగ్ సర్వీస్ అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ రవికుమార్ జైన్, ఐఎస్బి చైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, సెక్రటరీ సాజి ఆంటోని, వైస్ చైర్మన్ జయఫర్ మైదానీ, ఇసి సభ్యులు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, బిను మన్నిల్ వరుగీస్, ప్రేమలత ఎన్ఎస్, రాజేష్ నంబియార్, అజయకృష్ణన్ వి, ప్రిన్సిపాల్ విఆర్ పళనిస్వామి, రిఫా క్యాంపస్ పమేలా జేవియర్, స్టాఫ్ రిప్రజెంటేటివ్ జాన్సన్ కె దేవస్సీ, వైస్ ప్రిన్సిపల్స్, హెచ్డిలు, ప్రధాన ఉపాధ్యాయులు, ఆహ్వానిత అతిథులు పెద్దయెత్తున హాజరయ్యారు.
స్వర్ణ పతక విజేతలలో 12వ తరగతి పాఠశాల టాపర్లు అన్నా సాజు ముల్లప్పిల్లి (98.2%), ద్వారకా త్యాగరాజన్ (98%), బావ్య కొప్పల్ (96.6%), దిక్పాల్ ప్రకాష్ భాయ్ పటేల్ (96.6%), లియో థామస్ డొమినిక్ (96.6%) ఉన్నారు. అలాగే పదో తరగతి పాఠశాల టాపర్లు హైఫా మొహమ్మద్ షిరాజ్ (99%), మరియం థామస్ (99%), రింజ్ లోజీ (97.8%), స్వాతి సురేష్ (97.4%), తీర్ధ హరీష్ (97.4%) స్వర్ణ పతకాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







