మౌంట్ ఎవరెస్ట్పైకి యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్
- April 22, 2016
యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీ టీమ్, ఖాట్మండూ చేరుకున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి మౌంట్ ఎవరెస్ట్పైకి వెళ్ళేందుకు ఈ టీమ్ ప్రయత్నించనుంది. టీమ్లో మొత్తం 16 మంది ఉంటారు. ఇందులో 13 మిలిటరీలో వివిధ ర్యాంకులకు చెందినవారు. అందులో ఒకరు డాక్టర్, ముగ్గురు పర్వతారోహణలో నైపుణ్యం సాధించినవారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరంగా పేరొందిన మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ టీమ్. రెండు నెలల్లో శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్వతారోహణలో భాగంగా ఈ టీమ్ అనేకరకాలైన సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచు పర్వతాల్ని అధిరోహించేటప్పుడు ఆక్సిజన్ సరైన రీతిలో అందదు. అన్ని విధాలా శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ టీమ్ పర్వతారోహణకు సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









