బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురు సజీవదహనం
- November 10, 2022
ఏపీ: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.
పేలుడు ఘటనలో గాయపడ్డవారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







