45వ కువైట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం
- November 17, 2022
కువైట్: కువైట్ లో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంలో ఒకటైన 45వ కువైట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన మిష్రెఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రారంభమైంది. ఫెయిర్ను కువైట్ సమాచార- సాంస్కృతిక-యువజన వ్యవహారాల మంత్రి, జాతీయ సంస్కృతి- కళలు-లేఖల మండలి చైర్మన్ అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 26 వరకు జరగనుంది. పుస్తక ప్రదర్శన సందర్భంగా జరిగే కార్యకలాపాలు అనుభవాలు, సంస్కృతులను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి గొప్ప అవకాశం అని, ఇది సమాజాల అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి అల్-ముతైరీ అన్నారు.
బుక్ ఫెయిర్లో మొత్తం 29 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో 18 అరబ్ దేశాలు సహా 11 విదేశీ, అలాగే 404 పబ్లిషింగ్ హౌస్ లు, 117 ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ సారి ఇటలీ గౌరవ అతిథిగా పాల్గొంటోంది. కువైట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 5, 6, 7, 7B హాల్స్లో జరుగుతుంది. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు.. తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 10:00 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్ ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 4:00 నుండి 10:00 వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







