ఎస్వీ రంగారావు ఎవరు.?
- November 17, 2022
నట శేఖరుడు కృష్ణ మరణంతో తొలి తరం నట శకం ముగిసిపోయింది.. అంటూ ప్రస్థావిస్తున్నారు. ఎన్టీయార్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణలను పంచ రత్నాలుగా అభివర్ణిస్తున్నారు.
అవును కాదనలేం. వీళ్లు పంచ రత్నాలే వీళ్ల తరానికి. కానీ తొలి తరం నటులు వీళ్లు మాత్రం కానే కాదు. తొలి తరం నటులు అంటే, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, కాంతారావు తదితరులున్నారు.
కానీ, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తొలి తరం తొలి తరం.. అని తరచూ ప్రస్థావించడం కొందరు సీనియర్ సినీ ప్రముఖుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. తొలి తరం కథా నాయకుల్లో ఎస్వీ రంగారావు అత్యంత గొప్ప నటుడు. ఆయనతో ఎవ్వరినీ పోల్చలేం.
అలాగే కాంతారావు కూడా. అయితే, ఆయన ఆర్ధికంగా చితికిపోయారు. దాంతో ఆయన వారసులు సినీ రంగంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో వున్నారు ఆయన వారసులు.
తెలుగు సినీ చరిత్రని కొందరు వక్రీకరిస్తుంటారు. ఎన్టీయార్ గొప్పనటులే కాదనలేం. కానీ, అసలు నటనకు ప్రాణం పోసిన తొలి తరం నటులను మర్చిపోవడం వాళ్ల గౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుందనేది గమనించాలి.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







