ఇకపై కామెడీ చేస్తానంటోన్న జాన్వీ కపూర్.! ‘మిలి’ ట్రాక్ మార్చిందా.?

- November 17, 2022 , by Maagulf
ఇకపై కామెడీ చేస్తానంటోన్న జాన్వీ కపూర్.! ‘మిలి’ ట్రాక్ మార్చిందా.?

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్‌కీ, ఆఫ్ స్ర్కీన్ అప్పియరెన్స్‌కీ అస్సలు సంబంధమే లేకుండా వ్యవహరిస్తుంటుంది. 
ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ కమర్షియల్. అదేనండీ పక్కా గ్లామర్. ఆన్ స్ర్కీన్ పక్కా పర్ఫామర్. ఆమె ఎంచుకునే పాత్రలన్నీ కథా నేపథ్యమున్న పాత్రలే. వయసుకు మించిన పాత్రలతో డిఫరెంట్ పంథాలో వెళుతోంది జాన్వీ కపూర్. 
రీసెంట్‌గా ‘మిలి’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేసే వెయిటర్ పాత్రలో కనిపించింది. అనుకోని కారణంగా 48 గంటలు ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయి, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాల్లో భాగంగా పలికించిన హావభావాలు విమర్శకుల్ని సైతం మెప్పించాయ్.
అయితే, ఇకపై జాన్వీ కపూర్ యూత్‌ఫుల్ మూవీస్‌తో సందడి చేయబోతోందట. అందులో భాగంగానే కామెడీ జోనర్‌కి సై అనిందని తెలుస్తోంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అను ఓ స్పోర్ట్స్ కామెడీలో నటిస్తోంది. రాజ్ కుమార్ ఈ సినిమాలో జాన్వీకి జోడీగా నటిస్తున్నాడు. అలాగే, ‘బవాల్’ అను మరో రొమాంటిక్ కామెడీ సినిమానూ జాన్వీ లైన్‌లో పెట్టింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com