సౌదీలో 1 మిలియన్లకు పైగా ఇ-వీసాలు జారీ

- November 17, 2022 , by Maagulf
సౌదీలో 1 మిలియన్లకు పైగా ఇ-వీసాలు జారీ

రియాద్: 2019 నుండి 1 మిలియన్ కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాలు(ఇ-వీసా) జారీ చేసినట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇ-వీసాలు సౌదీ పర్యాటక ప్రధాన్యతల్లో ఒకటని పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. టూరిస్టులకు వైద్య బీమాతో పాటు 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఇ-వీసాలను జారీ చేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌ను అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడులు,  ఏజెన్సీలకు తక్షణ లైసెన్స్‌ల జారీ, విశ్వసనీయమైన మ్యాప్‌తో సహా దాదాపు 50 డిజిటల్ సేవలు,  విశ్వసనీయ డేటాను అందించడానికి 10 కంటే ఎక్కువ ప్రభుత్వ ఏజెన్సీలు అనుసంధానించబడి ఉన్నాయని అల్-ఖతీబ్ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com