19న బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె..
- November 17, 2022
న్యూ ఢిల్లీ: భారత దేశంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్. వెంకటాచలం వెల్లడించారు. తమ యూనియన్లకు చెందిన ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల దాడులు జరుగుతున్నాయని, దీన్ని నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్జి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల్ని విధుల్లోంచి తొలగించడం చేస్తున్నారని వెంకటాచలం ఆరోపించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ల హక్కుల్ని కాలరాస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు అనేక సర్వీసుల్ని ఔట్సోర్సింగ్కు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఉద్యోగుల బదిలీల్లో కూడా అనైతిక పద్ధతులు అనుసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని నిరసిస్తూ ఈ నెల 19, శనివారం సమ్మె చేపడుతున్నట్లు వెంకటాచలం వెల్లడించారు. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, వినియోగదారులు దీనికి అనుగుణంగా తమ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటే మంచిది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







