సౌదీలో 1 మిలియన్లకు పైగా ఇ-వీసాలు జారీ
- November 17, 2022
రియాద్: 2019 నుండి 1 మిలియన్ కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాలు(ఇ-వీసా) జారీ చేసినట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇ-వీసాలు సౌదీ పర్యాటక ప్రధాన్యతల్లో ఒకటని పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. టూరిస్టులకు వైద్య బీమాతో పాటు 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఇ-వీసాలను జారీ చేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్లాట్ఫారమ్ను అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఏకీకృత ప్లాట్ఫారమ్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు, ఏజెన్సీలకు తక్షణ లైసెన్స్ల జారీ, విశ్వసనీయమైన మ్యాప్తో సహా దాదాపు 50 డిజిటల్ సేవలు, విశ్వసనీయ డేటాను అందించడానికి 10 కంటే ఎక్కువ ప్రభుత్వ ఏజెన్సీలు అనుసంధానించబడి ఉన్నాయని అల్-ఖతీబ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







