ఆన్లైన్ నుసుక్ యాత్రికుల సేవను ప్రారంభించిన సౌదీ హజ్ మంత్రి
- November 18, 2022
మక్కా: యాత్రికుల కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ‘నుసుక్’ను అధికారికంగా ప్రారంభించినట్లు సౌదీ అరేబియా హజ్- ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా ప్రకటించారు. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ప్లాట్ఫారమ్ నుసుక్ 100 కంటే ఎక్కువ సేవలను అందజేస్తుందన్నారు. నుసుక్ వ్యాపారాలకు 75 సేవలను, వ్యక్తులకు 45 సేవలను అందిస్తున్నట్లు అల్-రబియా తెలిపారు. వ్యాపార రంగంలోని 10,000 కంటే ఎక్కువ సంస్థలు, 25 ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇది 30 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, సౌదీ టూరిజం అథారిటీ సహకారంతో నిర్వహిస్తున్న విజన్ 2030 యాత్రికుల అనుభవ కార్యక్రమంలో నుసుక్ భాగమని ఆయన చెప్పారు. ఉమ్రా చేసే అన్ని దశలలో మక్కా-మదీనాలోని చారిత్రక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలకు యాత్రికులను పరిచయం చేయడమే ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







