విజయవంతంగా విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగం

- November 18, 2022 , by Maagulf
విజయవంతంగా విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగం

శ్రీహరికోట: తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారు. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ కు విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు.

కాగా, ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్‌, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్‌ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com