‘యశోద’ సీక్వెల్కి సిద్ధమవుతోందా.?
- November 18, 2022
సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యశోద’ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైమ్లోనే సమంత అనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.
అలాగే, ముఖ్యంగా ‘యశోద’ టీమ్ గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే, ‘యశోద’ సినిమాకి సీక్వెల్స్ తీసే యోచనలో టీమ్ వున్నట్లు తెలుస్తోంది. దర్శకులు హరి, హరీష్ ఆల్రెడీ ‘యశోద 2’, అలాగే ‘యశోద 3’ కి సంబంధించిన స్టోరీ లైన్లు సిద్ధం చేసేశారట.
సమంత అనారోగ్యం నుంచి కోలుకొని వచ్చి, ‘యస్’ అంటే సీక్వెల్స్ పట్టాలెక్కించేయడమే తరువాయి అంటున్నారు. ప్రొడ్యూసర్లు కూడా ‘యశోద’ సీక్వెల్స్ విషయంలో సంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్2’ ఫ్రాంచైచీల మాదిరి, ‘యశోద’ని కూడా ప్రాంఛైజీల్లా తెరకెక్కించాలనుకుంటున్నారట.
రెండు, మూడు పార్టుల్లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కోసం కీలక పాత్రలుండబోతున్నాయట. ఈ టోటల్ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే, సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావల్సిన అవసరం వుంది. లెట్స్ హోప్.!
తాజా వార్తలు
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ







