‘యశోద’ సీక్వెల్కి సిద్ధమవుతోందా.?
- November 18, 2022
సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యశోద’ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైమ్లోనే సమంత అనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.
అలాగే, ముఖ్యంగా ‘యశోద’ టీమ్ గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే, ‘యశోద’ సినిమాకి సీక్వెల్స్ తీసే యోచనలో టీమ్ వున్నట్లు తెలుస్తోంది. దర్శకులు హరి, హరీష్ ఆల్రెడీ ‘యశోద 2’, అలాగే ‘యశోద 3’ కి సంబంధించిన స్టోరీ లైన్లు సిద్ధం చేసేశారట.
సమంత అనారోగ్యం నుంచి కోలుకొని వచ్చి, ‘యస్’ అంటే సీక్వెల్స్ పట్టాలెక్కించేయడమే తరువాయి అంటున్నారు. ప్రొడ్యూసర్లు కూడా ‘యశోద’ సీక్వెల్స్ విషయంలో సంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్2’ ఫ్రాంచైచీల మాదిరి, ‘యశోద’ని కూడా ప్రాంఛైజీల్లా తెరకెక్కించాలనుకుంటున్నారట.
రెండు, మూడు పార్టుల్లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కోసం కీలక పాత్రలుండబోతున్నాయట. ఈ టోటల్ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే, సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావల్సిన అవసరం వుంది. లెట్స్ హోప్.!
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







