కువైట్‌లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా

- November 19, 2022 , by Maagulf
కువైట్‌లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా

కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా నియామకం అయ్యారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2002 బ్యాచ్ IFS అధికారి స్వైకా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కువైట్ రాష్ట్రానికి భారత రాయబారిగా నియమితులైన ఆదర్శ్.. నవంబర్ 17న(గురువారం) భారత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆర్డర్స్ ని స్వీకరించారు. ఆదర్శ్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని UN విభాగంలో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అతను తన కెరీర్‌లో బీజింగ్, సోఫియా, మాస్కోలోని భారతీయ మిషన్లలో కూడా పనిచేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com